News September 13, 2024
లక్ష విగ్రహాల నిమజ్జనం.. 25వేల మందితో బందోబస్తు: CP

TG: ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 25 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1.30 గంటల్లోపు నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు అంగీకరించారని తెలిపారు. నగరవ్యాప్తంగా సుమారు లక్ష విగ్రహాలు హుస్సేన్సాగర్ ఒడికి చేరుకుంటాయని పేర్కొన్నారు.
Similar News
News January 15, 2026
హైదరాబాద్ కెప్టెన్గా మహ్మద్ సిరాజ్

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకండ్ ఫేజ్ మ్యాచ్లకు హైదరాబాద్ కెప్టెన్గా టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 15 మందితో కూడిన టీమ్ను ప్రకటించింది. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్గఢ్తో జరిగే మ్యాచ్లలో సిరాజ్ జట్టును నడిపించనున్నారు. రాహుల్ సింగ్ను VCగా ఎంపిక చేశారు. VHTలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్రావ్ పేరాల సైతం జట్టులో ఉన్నారు.
News January 15, 2026
పండక్కి అల్లుళ్లను ఇంటికి ఎందుకు పిలుస్తారు?

అల్లుడిని విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో ఆయనకు చేసే మర్యాదలు ఆ నారాయణుడికే చెందుతాయని, దీనివల్ల పితృదేవతలు శాంతించి వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అలాగే, పంట చేతికొచ్చే సమయంలో కూతురు, అల్లుడిని పిలిచి విందులు, వస్త్రదానాలతో సత్కరించడం ద్వారా 2 కుటుంబాల మధ్య బంధం బలపడుతుంది. అందుకే కొత్త అల్లుడు సంక్రాంతికి అత్తవారింటికి రావడం మన సంస్కృతిలో మధురమైన సంప్రదాయంగా మారింది.
News January 15, 2026
అంటురోగాల వ్యాప్తిని గుర్తించేందుకు వెబ్లింక్

AP: అపరిశుభ్రత, కలుషిత తాగునీటితో వాంతులు, విరేచనాల వంటి అంటురోగాలు ప్రబలుతుంటాయి. వీటిపై స్థానిక సిబ్బందికి, వారినుంచి పై స్థాయికి సమాచారం చేరడంలో జాప్యంతో సమస్య జటిలం అవుతోంది. దీని నివారణ కోసం ప్రజలను భాగస్వాములను చేసేలా వైద్యశాఖ IHIP వెబ్ లింక్ను ఏర్పాటుచేసింది. అంటురోగాల సమాచారాన్ని ఫొటోలతో సహా వారు అందులో పొందుపర్చవచ్చు. మరిన్ని వివరాలకు <


