News September 15, 2024
భారత దిగ్గజాలు ఇండియాను పాక్కు పంపండి.. ప్లీజ్: మోయిన్

పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ను పంపేలా క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్, ద్రవిడ్, గంగూలీ బీసీసీఐతో మాట్లాడాలని పాక్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ‘క్రికెట్ ఆగకూడదు. ఇరు దేశాలు ఆడటమనేది పాక్తో పాటు మొత్తం క్రికెట్కు మంచిది. ఇండియా రాకపోతే పాక్ కూడా భారత్లో పర్యటించకూడదు’ అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 11, 2025
షమీ విషయంలో ఆరోపణలను ఖండించిన BCCI!

షమీని కావాలనే సెలక్ట్ చేయట్లేదన్న ఆరోపణలను ఓ BCCI అఫీషియల్ ఖండించినట్లు PTI పేర్కొంది. ‘షమీ ఫిట్నెస్పై తరచూ వాకబు చేస్తూనే ఉన్నాం. అతణ్ని ఇంగ్లండ్ సిరీస్కు పంపేందుకు ప్రయత్నించాం. ఇంగ్లండ్ లయన్స్పై భారత్-A తరఫున అతడిని బరిలోకి దింపితే ఫిట్నెస్పై అంచనా వస్తుందనుకున్నాం. కానీ సిద్ధమయ్యేందుకు షమీ తగిన సమయం కావాలన్నారు. అతణ్ని సంప్రదించలేదన్నది అవాస్తవం’ అని ఆయన చెప్పినట్లు వెల్లడించింది.
News November 11, 2025
వరద బాధిత కుటుంబాలకు ₹12.99 కోట్ల సాయం

TG: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా ₹12.99 కోట్లు అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాలు, వరదల్లో 15 జిల్లాల్లో 8662 ఇళ్లు దెబ్బతిన్నట్లు కలెక్టర్లు నివేదికలు పంపారు. ఈ ఇళ్ల యజమానులకు ₹15,000 చొప్పున అందించనున్నారు. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అక్టోబర్ 27-30 వరకు వరుసగా 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలతో ఈ నష్టం వాటిల్లింది.
News November 11, 2025
లారీ బీభత్సం.. ముగ్గురు మృతి

నెల్లూరు: NTR నగర్ వద్ద నేషనల్ హైవేపై చేపల లోడుతో వెళ్తున్న కంటెయినర్ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన గల షాపులతో పాటు టాటా ఏస్, 3 బైకులు, చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు సహా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


