News September 16, 2024

వైద్య రంగంపై ప్రభుత్వం ఫోకస్.. రూ.5వేల కోట్లతో ప్రతిపాదనలు!

image

TG: వైద్య, ఆరోగ్య విభాగంలో చేపట్టనున్న పలు కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ₹4,944కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని కేంద్రానికి పంపి నిధుల కోసం వరల్డ్ బ్యాంకు సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ట్రామాకేర్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు, డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించింది.

Similar News

News April 2, 2026

ఎవరెస్ట్ ట్రెక్కింగ్‌లో భారీ స్కామ్.. ఎలా చేశారంటే?

image

ఎవరెస్ట్ పర్వతారోహణలో కొందరు షెర్పాలు, ఏజెన్సీలు రెస్క్యూ పేరుతో స్కామ్స్‌కు పాల్పడుతున్నట్లు తేలింది. ట్రెక్కర్ల ఆహారంలో కావాలనే బేకింగ్ సోడా అధికంగా వాడి వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. అనంతరం రెస్క్యూ పేరిట వారిని హెలికాప్టర్లలో తరలిస్తూ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి మూడేళ్లలో రూ.180 కోట్లకు పైగా క్లెయిమ్ చేసినట్లు చెప్పారు. ఈ స్కామ్‌పై విచారణ కొనసాగుతోంది.

News April 2, 2026

ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడరు: ఇరాన్

image

శత్రువు కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, అటాక్ చేస్తే ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని తమ దళాలకు ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఆదేశాలిచ్చారు. తమ దేశంపై గ్రౌండ్ ఆపరేషన్‌కు దిగితే ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడరని హెచ్చరించారు. ఎలాంటి దాడినైనా దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 2, 2026

పోలవరంలో కీలక ఘట్టం పూర్తి: చంద్రబాబు

image

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 1,372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.వెయ్యి కోట్లు వెచ్చించి నిర్మించామన్నారు. దీంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు. 2027 పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.