News September 18, 2024

పేజర్లలా మన మొబైళ్లనూ పేల్చేస్తే?

image

<<14129580>>లెబనాన్‌లో పేజర్ల<<>> పేలుళ్లతో నిత్యం మన చేతుల్లో ఉండే మొబైళ్లపై ఆందోళన వ్యక్తం అవుతోంది. సింపుల్ నెట్‌వర్క్, లిథియం బ్యాటరీలుండే డివైజులతోనే ఇంత విధ్వంసం జరిగింది. ఇక GPS ట్రాకర్, గూగుల్ మ్యాప్స్, పవర్‌ఫుల్ లిథియం బ్యాటరీ, 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే సెల్‌ఫోన్లను టెర్రరిస్టులు టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సైబర్ అటాక్స్‌పై భయం రెట్టింపైంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?

Similar News

News October 30, 2025

JIO యూజర్లకు ₹35,100 విలువైన గూగుల్ AI సేవలు ఫ్రీ!

image

JIO & GOOGLE భాగస్వామ్యంతో జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా (₹35,100 విలువైన) గూగుల్ AI Pro సేవలు లభించనున్నాయి. ఈ ప్లాన్‌లో Gemini 2.5 Pro, ఇమేజ్-వీడియో క్రియేషన్ టూల్స్, నోట్‌బుక్ LM & 2TB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. ఈ సేవలను తొలుత 18-25 ఏళ్ల Jio 5G యూజర్లకు అందించి.. ఆ తర్వాత అందరికీ విస్తరించనున్నారు. ‘AI సేవలను ప్రతి భారతీయుడికి అందించడమే లక్ష్యం’ అని ఇరు సంస్థలు తెలిపాయి.

News October 30, 2025

ALERT.. పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇవాళ 6.30pmకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుండగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

News October 30, 2025

విత్తనాల కొనుగోలుకు ₹110 కోట్ల బ్యాంకు రుణం

image

AP: రబీ(2025-26)లో పంపిణీ కోసం అవసరమైన విత్తనాల కొనుగోలుకు ఏపీ సీడ్ కార్పొరేషన్ ₹110 కోట్ల రుణం తీసుకోనుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి తీసుకొనే ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సంస్థ రుణాన్ని తీర్చలేని పక్షంలో ఈ గ్యారంటీ వర్తిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు, ముందస్తు క్లోజర్‌కు సున్నాఛార్జీలు ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ రుణంతో రైతులకు సకాలంలో విత్తనాలు అందిస్తారు.