News September 18, 2024

పేజర్లలా మన మొబైళ్లనూ పేల్చేస్తే?

image

<<14129580>>లెబనాన్‌లో పేజర్ల<<>> పేలుళ్లతో నిత్యం మన చేతుల్లో ఉండే మొబైళ్లపై ఆందోళన వ్యక్తం అవుతోంది. సింపుల్ నెట్‌వర్క్, లిథియం బ్యాటరీలుండే డివైజులతోనే ఇంత విధ్వంసం జరిగింది. ఇక GPS ట్రాకర్, గూగుల్ మ్యాప్స్, పవర్‌ఫుల్ లిథియం బ్యాటరీ, 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే సెల్‌ఫోన్లను టెర్రరిస్టులు టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సైబర్ అటాక్స్‌పై భయం రెట్టింపైంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?

Similar News

News December 12, 2025

ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పెద్దలతో భేటీకానున్నారు. 18న సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నారు. అదేరోజు రాత్రి పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఆమోదాలు, అనుమతులపై చర్చించే అవకాశం ఉంది. 19న సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరనున్నారు.

News December 12, 2025

రెండో విడత ప్రచారానికి తెర

image

TGలో రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12 వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పోలింగ్‌కు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.

News December 12, 2025

‘అఖండ-2’ సీక్వెల్ ఉంటుందా?

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజవ్వగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఎండ్ కార్డ్‌లో ‘జై అఖండ’ అనే టైటిల్ పోస్టర్ ఇవ్వడంతో సీక్వెల్‌పై చర్చ మొదలైంది. కాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న ‘నెట్‌ఫ్లిక్స్’లో త్వరలో ‘అఖండ-2’ స్ట్రీమింగ్ కానుంది. మూవీ చూసిన వారు ఎలా ఉందో కామెంట్ చేయండి.