News September 18, 2024

ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి: CPI నారాయణ

image

AP: వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. వరదలతో నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేక సాయం అందించాలన్నారు. విజయవాడలో సంభవించిన వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారు. బుడమేరును ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News September 9, 2025

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజీ

image

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. దేవుజీని నియమిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల మరణించారు.

News September 9, 2025

ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు: TDP

image

AP: రెండేళ్ల క్రితం ఇదేరోజున తమ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయాన్ని గుర్తుచేస్తూ TDP ట్వీట్ చేసింది. ‘SEP 9, 2023 ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు. ఓ నియంత వ్యవస్థలను చెరబట్టి, అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేసి రాక్షసానందం పొందిన రోజు. నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందో వారికి ఆరోజు తెలియలేదు. ఆయనకు మద్దతుగా ప్రజలు ఉద్యమించి CBNను విజేతగా నిలిపారు’ అని పేర్కొంది.

News September 9, 2025

నేపాల్ రణరంగం.. దుబాయ్ పారిపోయేందుకు PM ప్లాన్

image

నేపాల్‌లో సోషల్ మీడియాను పునరుద్ధరించినా నిరసనకారుల్లో ఆగ్రహజ్వాలలు చల్లారడం లేదు. ప్రజాప్రతినిధుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. దీంతో PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోవాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. అటు నిరసనకారులు మాజీ డిప్యూటీ ప్రధాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అధికార పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబా ఇంటిని తగులబెట్టారు.