News September 20, 2024
మాతృత్వంతో ఆనందం, ఆందోళన: అలియా భట్
తల్లి అయిన తర్వాత టైమ్ మేనేజ్మెంట్ సాధ్యం కావట్లేదని హీరోయిన్ అలియా భట్ చెప్పారు. తనకంటూ సమయం వెచ్చించలేకపోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మాతృత్వం ఆనందంగానే ఉన్నా ఆందోళన కూడా ఉందన్నారు. కూతురు రాహా అల్లరి, చిలిపి పిల్ల అని మురిసిపోయారు. 2022 నవంబర్లో బిడ్డకు జన్మనిచ్చిన అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 11న ఇది విడుదల కానుంది.
Similar News
News September 20, 2024
వాటర్ హీటర్ వాడుతున్నారా?
వాటర్ హీటర్తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిన్న NZB జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నీళ్లు వేడెక్కాయో లేదో చూసేందుకు హీటర్ ఉండగానే బకెట్లో చేయి పెట్టడంతో షాక్ తగిలి మరణించాడు. స్విచ్ఛాఫ్ చేసి ప్లగ్ తీసేసిన తర్వాతే నీటిని ముట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇనుము లేదా స్టీల్ కాకుండా ప్లాస్టిక్ బకెట్లు వాడాలని, అవి కరగకుండా ఓ చెక్క ముక్క ఉపయోగించాలంటున్నారు.
>SHARE IT
News September 20, 2024
మాజీ మంత్రి విడదల రజనిపై హోంమంత్రికి ఫిర్యాదు
AP: మాజీ మంత్రి రజని, ఆమె PA తమను బెదిరించి ₹2.20cr వసూలు చేశారని పల్నాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ సహ యజమాని చలపతిరావు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. 2020లో తనను పిలిచి మాట్లాడారని, డబ్బులు ఇవ్వకపోతే కంపెనీని సీజ్ చేయిస్తామని బెదిరించారన్నారు. 2021లో ₹2.20cr ఇచ్చినట్లు తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై హోంమంత్రి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
News September 20, 2024
కొత్త రేషన్ కార్డులపై రేపే తుది నిర్ణయం!
TG: కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం రేపు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై తుదినిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసాపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.