News September 20, 2024

పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడట్లేదు: TN ప్రభుత్వం

image

AP: తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడుతున్నారన్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ఏఆర్ డెయిరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Similar News

News March 20, 2026

265 పోస్టులు.. మార్చి 25 వరకు గడువు

image

మధ్యప్రదేశ్ ఇటార్సిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 265 కెమికల్ ప్రాసెస్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (NAC) ఉన్నవారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.19,900+DA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in

News March 20, 2026

BSNLలో 120 పోస్టులు.. మార్చి 31 వరకు గడువు

image

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 7 వరకు ఆఖరు తేదీ కాగా.. మార్చి 31 వరకు పొడిగించారు. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ ఏప్రిల్ 1 – 8వరకు చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. వెబ్‌సైట్: bsnl.co.in/

News March 20, 2026

శుక్రుని ఆరాధనతో కళత్ర దోషం దూరం

image

పురుష జాతకంలో శుక్రుడు వివాహ కారకుడు. శుక్రుడు నీచ స్థితిలో ఉన్నా, పాప గ్రహాలతో కలిసినా కళత్ర దోషం ఏర్పడి పెళ్లి ఆలస్యమవుతుంది. ఈ దోషం పోవడానికి శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించాలి. తెల్లటి వస్త్రాలు ధరించడం, మొలకలు వచ్చిన బొబ్బర్లను దానం చేయడం శుభప్రదం. లలితా సహస్రనామ పారాయణ చేస్తే శుక్ర గ్రహ దోషాలు తొలగి, వైవాహిక జీవితం సుఖమయం అవుతుంది. పరులకు సహాయం చేస్తే శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు.