News September 22, 2024
హిందువుల మనోభావాలను దెబ్బతీశారు: హీరో
తిరుమల లడ్డూ వ్యవహారంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం ఆందోళనకరం. ఇది లోపం కాదు. విశ్వాసాన్ని దెబ్బతీసినట్లే. హిందువులను అవమానపరిచారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని మనం ఒక ఉదాహరణగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 22, 2024
ALERT.. కాసేపట్లో పిడుగులు, వర్షాలు
TG: మరికాసేపట్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. 1-2 గంటల్లో తూర్పు హైదరాబాద్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. మెదక్, వనపర్తిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
News September 22, 2024
నెయ్యిలో కల్తీ జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అంబటి
AP: దైవాన్ని అడ్డుపెట్టుకుని CM చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే నెయ్యిని టెస్ట్ చేశారు. అందులో కల్తీ జరిగితే దానికి చంద్రబాబుదే బాధ్యత. జగన్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఎప్పుడూ వారి ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని CM గుర్తుపెట్టుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.
News September 22, 2024
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి: TTD ఈఓతో పవన్
AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని TTD ఈఓ శ్యామలరావును dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ పడొద్దని తేల్చిచెప్పారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈఓతో పవన్ భేటీ అయ్యారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈఓ తెలిపారు. TTD తరఫున రేపు మహాశాంతి యాగం చేపట్టనున్నట్లు వెల్లడించారు.