News September 23, 2024
ప్రభుత్వం పిరికిపంద చర్యలు ఆపాలి: BRS
TG: డాక్టర్లతో తాము ఏర్పాటు చేసిన బృందం ఆసుపత్రులను సందర్శిస్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని BRS ప్రశ్నించింది. వైద్యారోగ్య సేవల తీరుపై అధ్యయనం చేసే డాక్టర్ల బృందాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంది. డా.తాటికొండ రాజయ్య, డా.కల్వకుంట్ల సంజయ్, డా.మెతుకు ఆనంద్ ఇళ్ల వద్దకు చేరిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంది. ప్రభుత్వం ఇలాంటి పిరికిపంద చర్యలు మానుకోవాలని హితవు పలికింది.
Similar News
News September 23, 2024
రూ.30 కోట్లు రాబట్టిన ‘మత్తు వదలరా-2’
శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మత్తు వదలరా-2’ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. దీంతో సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. పదిరోజుల్లో ఈ సినిమాకు రూ.30.1 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు అమెరికాలోనూ $1 మిలియన్ దాటేసినట్లు తెలిపారు. ఈ సినిమాను రితేశ్ రాణా తెరకెక్కించారు.
News September 23, 2024
10 మంది MLAలకు హైకోర్టు నోటీసులు
TG: ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ వేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
News September 23, 2024
చైనా దూకుడుకు కళ్లెమేసే డిఫెన్స్ డీల్కు IND, US ఓకే
31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సిద్ధమైన భారత్ను అమెరికా స్వాగతించింది. $3.9 బిలియన్ల విలువైన ఈ అగ్రిమెంట్పై అక్టోబర్ లోపు 2 దేశాలూ సంతకాలు చేస్తాయని అంచనా. అధునాతన ఆయుధ వ్యవస్థల కో-ప్రొడక్షన్, ఇంటెలిజెన్స్, టెక్నాలజీ షేరింగ్ ఇందులో భాగం. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు వీటిని వాడతారని తెలిసింది. నేవీకి 15 సీ గార్డియన్స్, ఆర్మీ, ఎయిర్ఫోర్స్కు 16 స్కై గార్డియన్స్ డ్రోన్లు అందిస్తారు.