News September 23, 2024
కేజీ ఉల్లి రూ.35.. సప్లైకి సిద్ధంగా 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్
ఉల్లి ధరలకు కళ్లెమేసేందుకు బఫర్ స్టాక్ను కేంద్రం హోల్సేల్ మార్కెట్లకు సప్లై చేయనుంది. ఇప్పటికే కొన్ని సిటీల్లో NCCF, NAFED ద్వారా కిలో రూ.35కే అమ్ముతున్నట్టు ప్రకటించింది. ‘ఎగుమతి సుంకం ఎత్తేయడంతో ఉల్లి ధరలు పెరుగుతాయని ముందే అంచనా వేశాం. అందుకే మావద్ద ఉన్న 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ను సబ్సిడీతో విక్రయిస్తాం’ అని కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి అన్నారు. ప్రస్తుతం కేజీ ఉల్లి రూ.60గా ఉంది.
Similar News
News September 23, 2024
AIలో భద్రతా లోపాలు పెనుసవాలే!
OpenAI GPT, Google జెమిని, Meta LLaMA వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)లోని భద్రతా లోపాలు, మానవ ఆలోచనా విధానంపై వాటి అవగాహనలేమి ప్రపంచ భద్రతకు పెనుసవాలుగా పరిణమిస్తున్నాయి. హానికర AI మోడల్స్ టెర్రరిజం, సైబర్, ఆర్థిక నేరాలు, మాల్వేర్, తప్పుడు సమాచార సృష్టి, మాదకద్రవ్యాలు-ఆయుధాల తయారీ వంటి కార్యకలాపాల్లో సహాయపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News September 23, 2024
నిద్ర పోయి రూ.9లక్షలు గెలుచుకుంది!
ఏంటి ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సాయిశ్వరికి ఇది సాధ్యమైంది. తనకు ఎంతో ఇష్టమైన నిద్రను డబ్బుగా మలిచేందుకు ఆమెకు గొప్ప అవకాశం లభించింది. ఓ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నిర్వహించింది. 12 మందిలో ఒకరిగా ఎంపికైంది. కంపెనీ ఇచ్చిన పరుపుపై 2 నెలల పాటు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోవడమే టాస్క్. విజయవంతంగా టాస్క్ పూర్తిచేయడంతో ఆమె రూ.9లక్షలు గెలుచుకుంది.
News September 23, 2024
రికార్డు సృష్టించిన బాలీవుడ్ మూవీ
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన ‘స్త్రీ2’ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటివరకు భారత్లో రూ.604.22 కోట్లు(నెట్) రాబట్టగా రూ.713 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు తెలిపింది.