News September 23, 2024

హరీశ్ శంకర్‌కు బంపరాఫర్?

image

‘మిస్టర్ బచ్చన్‌’తో అభిమానులను నిరుత్సాహానికి గురి చేసిన దర్శకుడు హరీశ్ శంకర్ బంపరాఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవల హరీశ్, చిరు కాంబినేషన్లో వచ్చిన యాడ్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తాయి.

Similar News

News September 23, 2024

అది నా జీవితంలో హైలైట్.. థాంక్యూ మెగాస్టార్: హరీశ్ శంకర్

image

తన డైరెక్షన్లో ఓ యాడ్ షూట్‌లో నటించిన మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు హరీశ్ శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘2 వారాలుగా జ్వరంతో బాధపడుతున్నా. నా జీవితంలో హైలైట్‌ను ఎట్టకేలకు ఇప్పుడు పంచుకుంటున్నా. కేవలం ప్రకటన కోసమే అయినా ఈ అనుభవం అద్భుతం. సెట్‌లో ప్రతి క్షణం ఓ మ్యాజిక్. ఆ రోజును నా జీవితాంతం మర్చిపోను. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ బాస్’ అని పేర్కొన్నారు.

News September 23, 2024

AIలో భద్రతా లోపాలు పెనుసవాలే!

image

OpenAI GPT, Google జెమిని, Meta LLaMA వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)లోని భద్రతా లోపాలు, మానవ ఆలోచనా విధానంపై వాటి అవగాహనలేమి ప్రపంచ భ‌ద్ర‌త‌కు పెనుస‌వాలుగా పరిణమిస్తున్నాయి. హానికర AI మోడల్స్‌ టెర్రరిజం, సైబర్, ఆర్థిక నేరాలు, మాల్వేర్, త‌ప్పుడు స‌మాచార సృష్టి, మాదకద్రవ్యాలు-ఆయుధాల తయారీ వంటి కార్యకలాపాల్లో సహాయపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

News September 23, 2024

నిద్ర పోయి రూ.9లక్షలు గెలుచుకుంది!

image

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సాయిశ్వరికి ఇది సాధ్యమైంది. తనకు ఎంతో ఇష్టమైన నిద్రను డబ్బుగా మలిచేందుకు ఆమెకు గొప్ప అవకాశం లభించింది. ఓ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ నిర్వహించింది. 12 మందిలో ఒకరిగా ఎంపికైంది. కంపెనీ ఇచ్చిన పరుపుపై 2 నెలల పాటు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోవడమే టాస్క్. విజయవంతంగా టాస్క్ పూర్తిచేయడంతో ఆమె రూ.9లక్షలు గెలుచుకుంది.