News September 24, 2024

రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ

image

AP: వరదలతో నష్టపోయిన బాధితుల అకౌంట్లలోకి రేపు ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది. విజయవాడలో 179 సచివాయాల పరిధిలోని ప్రజలకు సాయం అందనుంది. వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్‌కు రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండే వారికి రూ.10 వేలు ఇవ్వనున్నారు. ధ్వంసమైన దుకాణాలకు రూ.25వేలు, పంటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున అందిస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ఇళ్లకు రూ.10 వేలు ఇవ్వనున్నారు.

Similar News

News January 9, 2026

97% మందికి వైకుంఠ ద్వార దర్శనం: CM CBN

image

AP: తిరుమల పవిత్రతను కాపాడేేందుకు భక్తుల సహకారం అవసరమని CM CBN అన్నారు. వైకుంఠ ఏకాదశిని అద్భుతంగా నిర్వహించిన TTDని అభినందించారు. DEC 30-JAN 8 వరకు 7.83 లక్షల మందికి వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 97% మంది సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం అభినందనీయమన్నారు. క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ నుంచి అమలు చేసిన అన్ని విధానాలు సత్ఫలితాలనిచ్చాయన్నారు.

News January 9, 2026

అద్దె బస్సులు.. సమ్మె రద్దు

image

AP: ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు <<18795223>>సమ్మె<<>> రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టగా ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు పేర్కొన్నారు. దీంతో సంక్రాంతి వేళ ప్రయాణికులకు ప్రయాణకష్టాలు తప్పినట్లే.

News January 9, 2026

పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్!

image

పాక్ క్రికెట్ బోర్డు నిర్వహించే PSLలో 2కొత్త టీమ్స్ చేరాయి. సియాల్‌కోట్ ఫ్రాంచైజీని OG డెవలపర్స్ ₹58.38 కోట్లకు, హైదరాబాద్ ఫ్రాంచైజీని ₹55.57 కోట్లకు FKS గ్రూప్ దక్కించుకున్నాయి. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హైదరాబాద్ పేరుతో సిటీ ఉంది. హైదరాబాద్ ఫ్రాంచైజీ విలువ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ శాలరీ (₹26.75Cr+27Cr)తో దాదాపు సమానం కావడం గమనార్హం. మొత్తం 8 టీమ్స్‌తో మార్చి 26 నుంచి PSL ప్రారంభం కానుంది.