News September 24, 2024

తిరుమలలో రూ.22 కోట్లతో FSSAI ల్యాబ్

image

తిరుమలలో ₹22 కోట్లతో ల్యాబ్ ఏర్పాటుకు FSSAI సిద్ధమైంది. ఇందుకోసం 12000 చదరపు అడుగుల స్థలాన్ని TTD కేటాయించింది. లడ్డూ, అన్నదానం, ఇతర అవసరాల కోసం రూ.800 కోట్లకు పైగా విలువైన పదార్థాలను TTD ఏటా కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలనకు FSSAI ల్యాబ్ ఏర్పాటు చేయాలని TTD ఇటీవల కోరింది. ఇందులో ₹5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, ₹9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, ₹6 కోట్లతో బేసిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు.

Similar News

News January 9, 2026

భూరికార్డులను ఎవరూ మార్చలేరు: చంద్రబాబు

image

AP: పాస్‌బుక్స్ పంపిణీ పవిత్రమైన కార్యక్రమమని CM చంద్రబాబు తెలిపారు. తూ.గో.జిల్లా రాయవరంలో ఆయన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రాణం పోయినా రైతు భూమి కోల్పోయేందుకు అంగీకరించడు. సున్నితమైన అంశంతో పెట్టుకోవద్దని మాజీ CMకు చెప్పినా వినలేదు. కూటమి రాకపోయుంటే రైతుల భూములు గోవిందా గోవిందా. రాజముద్ర వేసి మళ్లీ పాస్‌బుక్స్ ఇస్తున్నాం. మీ భూరికార్డులను ఎవరూ మార్చలేరు. మోసం చేయలేరు’ అని స్పష్టం చేశారు.

News January 9, 2026

ఈ మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వద్దు

image

మన ఇళ్లు, పొలాల గట్ల దగ్గర పెంచుకోదగ్గ మొక్కల్లో అరటి, బొప్పాయి, జామ, నిమ్మ, ఉసిరి, మునగ, అవిసె, పందిరి చిక్కుడు, బచ్చలి, గుమ్మడి, కరివేపాకు, కుంకుడు మొదలైనవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ మొక్కలను ఒకసారి నాటితే ఎక్కువకాలం ఫలాలనిస్తాయి. వీటి పెంపకానికి పెద్దగా ఖర్చు కానీ, యాజమాన్యం కానీ అవసరం ఉండదు. ఇవి తక్కువ విస్తీర్ణంలో పెరుగుతూ ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్నిస్తూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

News January 9, 2026

మంత్రి చెప్పినా ఎందుకు పెంచారు.. టికెట్ ధరలపై HC ఆగ్రహం

image

TG: ‘రాజా సాబ్’ టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచనా విధానం మారదా? అని ఫైరయింది. టికెట్ రేట్లు పెంచబోమని మంత్రి ప్రకటించినా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని ప్రశ్నించింది. మెమో ఇచ్చిన అధికారికి రూల్స్ తెలియవా? అని నిలదీసింది. కాగా అర్ధరాత్రి టికెట్ రేట్ల పెంపుపై ఓ లాయర్ కోర్టుకెళ్లారు.