News September 24, 2024
నేడు భూమిని సమీపిస్తున్న విమానం సైజు గ్రహశకలం

పల్లీ ఆకారంలోని 2 గ్రహశకలాలు మంగళవారం రాత్రి భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్తాయని నాసా జెట్ ప్రొపల్షన్ లెబోరేటరీ తెలిపింది. అందులో ఒకటి విమానం (120 ఫీట్) సైజులో ఉంటుంది. 2024 RO11గా పిలిచే ఇది భూమికి 45.8 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. బస్సు (26 ఫీట్) సైజులో ఉండే 2020 GE శకలం మన గ్రహానికి కేవలం 4.10 లక్షల మైళ్ల దూరం నుంచే వెళ్తుండటం గమనార్హం. ప్రత్యేకమైన టెలిస్కోపులతో వీటిని చూడొచ్చు.
Similar News
News January 19, 2026
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!

వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీనికి ముందు వరుసగా 3 రోజులు సెలవులున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27న సమ్మె జరగనుంది. దీంతో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ పనులుంటే ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్.
News January 19, 2026
వందే భారత్ స్లీపర్ టికెట్లకు కొత్త నిబంధనలు

వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కిన వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రైన్లో టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ను మరింత కఠినతరం చేసింది. 72 గంటలకు ముందు టికెట్ రద్దు చేస్తే 25%, 72 నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 50% ఛార్జ్ కట్ అవుతుంది. 8 గంటలలోపు రద్దు చేస్తే ఒక్క రూపాయి కూడా రిఫండ్ ఉండదు. వందేభారత్ స్లీపర్లో RAC, వెయిటింగ్ లిస్ట్ ఉండవని ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది.
News January 19, 2026
WPL: RCBతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్లో ఇవాళ గుజరాత్, బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్లో ఓటమే(4 మ్యాచులు) ఎరుగని RCB ఈ మ్యాచులోనూ గెలిచి విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. అటు తొలి రెండింట్లో ఓడి తర్వాతి 2 మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.


