News September 24, 2024

నేడు భూమిని సమీపిస్తున్న విమానం సైజు గ్రహశకలం

image

పల్లీ ఆకారంలోని 2 గ్రహశకలాలు మంగళవారం రాత్రి భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్తాయని నాసా జెట్ ప్రొపల్షన్ లెబోరేటరీ తెలిపింది. అందులో ఒకటి విమానం (120 ఫీట్) సైజులో ఉంటుంది. 2024 RO11గా పిలిచే ఇది భూమికి 45.8 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. బస్సు (26 ఫీట్) సైజులో ఉండే 2020 GE శకలం మన గ్రహానికి కేవలం 4.10 లక్షల మైళ్ల దూరం నుంచే వెళ్తుండటం గమనార్హం. ప్రత్యేకమైన టెలిస్కోపులతో వీటిని చూడొచ్చు.

Similar News

News July 10, 2025

అకౌంట్లలోకి రూ.13,000.. చెక్ చేసుకోండిలా!

image

AP: ‘తల్లికి వందనం’ 2వ విడత డబ్బులను ప్రభుత్వం ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి విడతలో పలు కారణాలతో ఆగిపోయిన, ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున వేస్తోంది. నగదు స్టేటస్ కోసం వాట్సాప్ మనమిత్ర నంబర్ 95523 00009కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి. అందులో తల్లికి వందనం ఆప్షన్ ఎంచుకొని, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి.

News July 10, 2025

త్వరలో ఆదర్శ రైతుల ద్వారా పథకాల అమలు: రైతు కమిషన్

image

TG: త్వరలో గ్రామానికి ఒక ఆదర్శ రైతును ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కీములను వారి ద్వారా అమలు చేస్తామన్నారు. అయితే ఆదర్శ రైతులకు వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. కాగా 2007లో కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. గౌరవ వేతనం కింద నెలకు రూ.1,000 అందించింది. 2017లో BRS ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది.

News July 10, 2025

8th పే కమిషన్: భారీగా పెరగనున్న జీతాలు!

image

8th పే కమిషన్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇది అమలైతే జీతాలు, పెన్షన్లు 30-34% పెరుగుతాయని Ambit Capital(ఫైనాన్షియల్ అడ్వైజర్) అంచనా వేసింది. 44లక్షల మంది ఉద్యోగులు, 68లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. బేసిక్ పే, అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయంది. కాగా కొత్త పే స్కేల్ 2026 JAN నుంచి అమలవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.