News September 25, 2024

హజ్ యాత్ర దరఖాస్తు గడువు పొడిగింపు

image

AP: హజ్ యాత్రకు దరఖాస్తు గడువును హజ్ కమిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ఎన్ఎమ్‌డీ ఫరూక్ తెలిపారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు 1,937 మంది యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

Similar News

News September 25, 2024

సూసైడ్ క్యాప్సుల్‌లో తొలి మరణం!

image

స్విట్జర్లాండ్‌లో ఓ మహిళ సూసైడ్ క్యాప్సుల్ ‘సార్కో పాడ్’ సాయంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆమె ఆత్మహత్యకు సహకరించారన్న ఆరోపణలతో పలువురిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జర్మనీ సరిహద్దు మేరీషాజన్ అటవీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ ఆత్మహత్య జరిగింది. కాగా ఈ క్యాప్సుల్‌లోని బటన్ నొక్కగానే నైట్రోజన్ వాయువు విడుదలై అందులో పడుకున్న వ్యక్తి ఊపిరాడక నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు.

News September 25, 2024

హర్షసాయి కోసం గాలింపు

image

TG: యూట్యూబర్ హర్షసాయి కోసం నార్సింగి పోలీసులు గాలిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. విశాఖతో పాటు మరికొన్ని చోట్ల అతడి కోసం బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. హర్ష పరారీలో ఉన్నాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా 376(2), 376N, 354 సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదైంది.

News September 25, 2024

కాన్పూర్ టెస్ట్.. బుమ్రాకు రెస్ట్?

image

భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈనెల 27 నుంచి జరగనున్న 2వ టెస్ట్‌లో స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కివీస్, AUSతో సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉండటం, కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో అతడిని డ్రాప్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే IND అశ్విన్, జడేజాతో పాటు మరో స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. ఆ స్థానం కోసం కుల్దీప్, అక్షర్ పోటీ పడుతున్నారు.