News September 25, 2024
భారీ వర్షాలు.. తీవ్ర విషాదం
TG: భారీ వర్షాలు రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపాయి. పిడుగుపాటుకు వివిధ ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. భద్రాద్రి(D) దమ్మపేట(మ) జగ్గారంలో వర్షం పడుతోందని ఓ చెట్టు కిందకు వెళ్లడంతో సమీపంలో పిడుగుపడి నాగశ్రీ(22), అనూష(23) చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహబూబ్నగర్, కరీంనగర్, NZB జిల్లాల్లో ఇద్దరు వృద్ధులు, మరో వ్యక్తి(29) తుదిశ్వాస విడిచారు.
Similar News
News September 25, 2024
మంత్రులు జూపల్లి, ఉత్తమ్కు చేదు అనుభవం
TG: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఉదండాపూర్ రిజర్వాయర్ను పరిశీలించేందుకు మంత్రులు వెళ్లగా నిర్వాసితులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవితోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భూ నిర్వాసితులపై మండిపడ్డారు.
News September 25, 2024
హైడ్రా బాధితులకు అండగా ఉంటాం: KTR
TG: హైడ్రా బాధితులందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR భరోసా ఇచ్చారు. న్యాయపరంగా ఎలాంటి అవసరం ఉన్నా తెలంగాణ భవన్కు వచ్చి వివరాలు అందించాలని సూచించారు. ఇక హైదరాబాద్లో ఆక్రమణల తొలగింపు ఉద్దేశం మంచిదే అయినా ముందు వాళ్లకు వేరేచోట ఆవాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ‘అలా కాకుండా ఉన్నపళంగా ఫుట్పాత్లపై ఏర్పాటు చేసుకున్న పేదల దుకాణాలను కూల్చేయడం సరికాదు’ అని KTR మండిపడ్డారు.
News September 25, 2024
కార్తీ ఫ్యామిలీకి ఇవి అలవాటే: నటి కస్తూరి
తిరుమల లడ్డూపై హీరో కార్తీ చేసిన <<14180101>>వ్యాఖ్యలపై<<>> సీనియర్ నటి కస్తూరి స్పందించారు. ‘కార్తీ కుటుంబం సనాతన పద్ధతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేంకాదు. శబరిమలపై శివకుమార్ వ్యాఖ్యలు, ఆలయాల కంటే ఆస్పత్రులపై ఎక్కువ దృష్టి పెట్టాలని జ్యోతిక చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులు ఇలాంటివి సహించరు. ఆంధ్రాలో హిందూ వ్యతిరేకతను స్వాగతించరు’ అని ట్వీట్ చేశారు.