News September 25, 2024
నామినేటెడ్ నేతలతో సీఎం సమీక్ష

AP: ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో సమీక్ష నిర్వహించారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడిన వారికి అవకాశాలు ఇచ్చామని ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నేతలతో కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలని చెప్పారు.
Similar News
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
News September 18, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.