News September 27, 2024

IPL అభిమానులకు బ్యాడ్ న్యూస్?

image

IPL-2025లో మ్యాచ్‌ల సంఖ్యను 84కు పెంచేది లేదని BCCI తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి 74 మ్యాచ్‌లే ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా వచ్చే సీజన్‌లో 84 మ్యాచ్‌లు ఆడించాలని గతంలో BCCI యోచించింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 27, 2024

బాలకృష్ణ చాలా గౌరవంతో వ్యవహరిస్తారు: ఊర్వశి

image

NBK109లో నందమూరి బాలకృష్ణతో కలిసి నటించడం అద్భుతంగా అనిపించిందని హిందీ నటి ఊర్వశి రౌతేలా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన గురించి మీడియాలో, బయట చాలా వ్యాఖ్యలు విన్నాను. నటించే సమయంలో నాకైతే అలా అనిపించలేదు. ఆయన చాలా గౌరవంగా, ప్రొఫెషనల్‌గా ఉంటారు. నటనలో అపార అనుభవం ఉంది. సెట్స్‌లో చాలా ఫోకస్డ్‌గా, క్రమశిక్షణగా ఉంటారు. నా వరకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందీ కలగలేదు’ అని వివరించారు.

News September 27, 2024

కుప్పకూలిన బంగారు గని.. 15 మంది మృతి

image

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ సుమత్రలో కొండచరియలు విరిగిపడటంతో అక్రమ బంగారు గని కుప్పకూలి 15 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు పేర్కొన్నారు. రిమోట్ ఏరియా కావడంతో రవాణా సదుపాయం సరిగా లేదని వెల్లడించారు. దీంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతున్నట్లు చెప్పారు.

News September 27, 2024

కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నమోదు

image

కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నిర్ధారణ అయ్యింది. ఎర్నాకుళం వాసికి ప‌రీక్ష‌ల్లో వైరస్‌ పాజిటివ్‌గా తేలిన‌ట్టు కేరళ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఏ స్ట్రెయిన్ అన్న‌ది ఇంకా నిర్ధార‌ణకాలేదు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. Sep 18న కేర‌ళ‌లోని మ‌ల‌ప్పురంలో UAE నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి వైర‌స్ పాజిటివ్‌గా తేలడంతో దేశంలోనే మొద‌టి కేసు న‌మోదైంది.