News September 28, 2024
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు పొడిగింపు
TG: ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పొడిగించింది. ప్రభుత్వ కళాశాలల్లో రూ.500 జరిమానాతో, ప్రైవేట్ కాలేజీల్లో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పించింది. కాగా విద్యార్థులను చేర్పించే కాలేజీలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో? లేదో? గమనించుకోవాలని తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు సూచించింది.
Similar News
News September 28, 2024
విజన్ 2047 కోసం మీ సలహాలివ్వండి: చంద్రబాబు
AP భవిష్యత్తు కోసం ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘2047 నాటికి $2.4 ట్రిలియన్ GSDP, $43,000 కంటే ఎక్కువ తలసరి ఆదాయంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 వైపు ప్రయాణం ప్రారంభించినందున మెరుగైన రాష్ట్ర భవిష్యత్తు కోసం పౌరుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నాం. కలిసి APని నిర్మించుకుందాం’ అని CM పిలుపునిచ్చారు. మీ ఆలోచనను పంచుకునేందుకు ఇక్కడ <
News September 28, 2024
నిజమేనని తేలితే RGకర్ మాజీ ప్రిన్సిపల్కు మరణదండనే: CBI కోర్టు
RGకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ఘోష్కు CBI కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయనపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని, నిజమేనని తేలితే మరణదండనకు దారితీస్తాయని తెలిపింది. నిందితుడిని బెయిల్పై రిలీజ్ చేయడం అన్యాయమే అవుతుందంది. టాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ బెయిల్నూ తిరస్కరించింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సాక్ష్యాల ట్యాంపరింగ్, FIR లేట్ కేసులో వీరు అరెస్టయ్యారు.
News September 28, 2024
నేడు తిరుమలకు సిట్
AP: లడ్డూ వివాదం నేపథ్యంలో ఏర్పాటైన సిట్ ఇవాళ తిరుమలలో పర్యటించనుంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలోని బృందం టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశం కానుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై వివరాలు సేకరించనున్నారు.