News September 28, 2024

నోట్ల చలామణీ 1976, 2024లో ఎలా ఉందంటే?

image

RBI లెక్కల ప్రకారం 1976 మార్చి 31 నాటికి దేశంలో చలామణీలో ఉన్న నగదు మొత్తం రూ.7,144 కోట్లు. ఇందులో రూ.87.91 కోట్ల విలువైన రూ.1,000 నోట్లు, రూ.22.90 కోట్ల విలువైన రూ.5వేల నోట్లు ఉండేవి. రూ.10వేల నోట్లను 1,260 మాత్రమే ముద్రించారు. వీటి విలువ రూ.1.26 కోట్లు. దేశం మొత్తం కరెన్సీలో రూ.5,000, రూ.10,000 నోట్ల వాటా కేవలం 2 శాతం లోపే. ప్రస్తుతం దేశంలో చలామణీలో ఉన్న నగదు రూ.34.90 లక్షల కోట్లు.

Similar News

News December 27, 2025

పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు అప్లై!

image

పుణేలో ఓ ప్రేమజంట విడాకులు నెట్టింట చర్చకు తెరలేపాయి. మ్యారేజ్ తర్వాత తాను మర్చంట్ నేవీలో డాక్టర్ అని భర్త చెప్పాడు. డ్యూటీకి వెళ్తే 6 నెలలు ఓడలోనే ఉండాల్సి వస్తుందని వివరించాడు. ఈ విషయం ముందే చెప్పాలి కదా అని భార్య నిలదీసింది. దీంతో వారు 24 గంటల్లోనే విడాకులకు అప్లై చేశారు. ఏ విషయమైనా పెళ్లికి ముందే చర్చించుకోవాలని, ఇలాంటివి అసలు దాచొద్దని నెటిజన్స్ అంటున్నారు.

News December 27, 2025

‘మేక్ ఇన్ ఇండియా’తో ఎలక్ట్రానిక్స్ రంగం పరుగులు: కేంద్రమంత్రి

image

ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్‌ రంగం ‘మేక్ ఇన్ ఇండియా’తో పరుగులు పెడుతోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘2014-15మధ్య 2 మొబైల్ తయారీ యూనిట్స్ ఉంటే ఇప్పుడు 300కు పెరిగాయి. రూ.18వేల కోట్లుగా ఉండే మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి రూ.5.5లక్షల కోట్లకు పెరిగింది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తి రూ.1.9 లక్షల కోట్ల నుంచి రూ.11.3 లక్షల కోట్లకు, వాటి ఎగుమతి రూ.3.3లక్షల కోట్లకు పెరిగింది’ అని <>ట్వీట్<<>> చేశారు.

News December 27, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న మొత్తం 72,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చింది. వరుస సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది.