News September 28, 2024
దేశ పర్యాటకం మెరుగుపడుతోంది.. కానీ!
2024 ప్రథమార్థంలో 4.78 మిలియన్ల మంది విదేశీయులు భారత్లో పర్యటించారు. US, బంగ్లాదేశ్ నుంచి అధికంగా వస్తున్నట్టు పర్యాటక శాఖ తెలిపింది. వరల్డ్ టూరిజం డే సందర్భంగా రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇది టూరిజం వృద్ధిని సూచిస్తున్నప్పటికీ కరోనా ముందు ఉన్న పరిస్థితుల కంటే వెనుకబడినట్టు స్పష్టం అవుతోంది. భారత టూరిజం హబ్ లక్ష్యాలను ఇది ప్రభావితం చేస్తుందని ఆ శాఖ పేర్కొంది.
Similar News
News September 29, 2024
నటి కుష్బూ ట్వీట్.. థాంక్స్ చెప్పిన ఎన్టీఆర్
తాను లండన్లో ‘దేవర’ సినిమా చూసినట్లు సీనియర్ నటి కుష్బూ ట్వీట్ చేశారు. ‘ఇతనే నా హీరో. సూపర్బ్ మాస్. దీనిని నేను ఎలా మిస్ అవుతాను? దేవరగా అతను ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం చూస్తున్నాను’ అని పేర్కొన్నారు. దీనికి Jr.NTR ‘థాంక్యూ మేడమ్. మీకు నచ్చినందుకు సంతోషం’ అని రిప్లై ఇచ్చారు. తారక్ తన ఫేవరెట్ యాక్టర్ అని కుష్బూ గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.
News September 29, 2024
తిరుమలలో చిరుత కలకలం
AP: తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు దగ్గర చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ గార్డులు టీటీడీ అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా గతంలోనూ తిరుమలలో సంచరించిన చిరుత ఓ చిన్నారిని చంపిన విషయం తెలిసిందే.
News September 29, 2024
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఇవాళ HYD, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అటు APలోని మన్యం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉ.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, YSR, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంది.