News September 29, 2024

కన్సల్టేటివ్ ఫోరం ఛైర్మన్‌గా నారా లోకేశ్

image

AP: సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో పనిచేసే దీనికి ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్ వ్యవహరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఇది పనిచేయనుంది. ప్రభుత్వ శాఖలను RTGS శాఖ సమన్వయం చేస్తుంది.

Similar News

News September 29, 2024

IPL: అక్టోబర్ 31 లాస్ట్ డేట్?

image

అక్టోబర్ 31 సాయంత్రం 5 గంటలలోగా అన్ని ఫ్రాంచైజీలు తమ ఫైనల్ రిటెన్షన్ల లిస్టును సమర్పించాలని బీసీసీఐ నిర్దేశించినట్లు తెలుస్తోంది. రిటెన్షన్‌లో గరిష్ఠంగా ఐదుగురు క్యాప్‌డ్, గరిష్ఠంగా ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు అనుమతించినట్లు సమాచారం. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు రూ.4 కోట్ల జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా బీసీసీఐ కాంట్రాక్టు పొందని వారిని అన్‌క్యాప్‌డ్‌గా భావిస్తారని సమాచారం.

News September 29, 2024

హైదరాబాద్‌లో ప్రతిపాదిత మెట్రో మార్గాలివే

image

☞ కారిడార్-4: నాగోల్-RGIA(36.6కి.మీ)
☞ కారిడార్-5: రాయదుర్గం-కోకాపేట్(11.6కి.మీ)
☞ కారిడార్-6: MGBS-చాంద్రాయణగుట్ట(7.5కి.మీ)
☞ కారిడార్-7: మియాపూర్-పటాన్‌చెరు(13.7కి.మీ)
☞ కారిడార్-8: ఎల్బీనగర్-హయత్‌నగర్(7.1కి.మీ)
☞ కారిడార్-9: RGIA-ఫోర్త్ సిటీ(40కి.మీ)
☞☞ 116.2కి.మీ మార్గాన్ని రూ.32,237 కోట్ల <<14226006>>అంచనాతో <<>>ప్రతిపాదించి కేంద్రానికి ప్రభుత్వం పంపనుంది.

News September 29, 2024

చరిత్ర సృష్టించిన శ్రీలంక

image

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత ఆ జట్టు కివీస్‌పై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 88కే ఆలౌటైన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 360కే పరిమితమైంది. కాన్వే(61), బ్లండెల్(60), ఫిలిప్స్(78), శాంట్నర్(67) అర్ధ సెంచరీలతో రాణించారు. నిశాన్ పెరీస్ 6 వికెట్లతో చెలరేగి లంకకు విజయాన్ని కట్టబెట్టారు.