News September 30, 2024

రూ.7,200 కోట్లివ్వండి.. కేంద్రానికి రాష్ట్రం లేఖ

image

AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి రూ.7,200 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నవంబర్ నుంచి పనులు ప్రారంభించి ఒకే సీజన్‌లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ నిధులు విడుదల చేస్తే పోలవరం హెడ్ వర్క్స్ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది.

Similar News

News November 12, 2025

రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు: PCC చీఫ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ రిగ్గింగ్‌కు పాల్పడిందన్న BRS ఆరోపణలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. ‘రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు. ఇది పాత జమానా కాదు. BRS వాళ్లు ఓడిపోతున్నామనే బాధలో మాట్లాడుతున్నారు. మళ్లీ మేమే వస్తాం. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్తాం. క్యాబినెట్ విస్తరణ సీఎం, అధిష్ఠానం చూసుకుంటుంది’ అని మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.

News November 12, 2025

కొబ్బరి చెట్లకు నీటిని ఇలా అందిస్తే మేలు

image

కొబ్బరి తోటల్లో నేల తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో నీటిని తోటలలో పారించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృథా అయ్యి తెగుళ్లు కూడా తొందరగా ఇతర మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్లెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా లేదా డ్రిప్ విధానంలో తోటలకు నీటిని అందించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.

News November 12, 2025

‘పెద్ది’ సినిమాలో సీనియర్ నటి?

image

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’లో సీనియర్ నటి శోభన కీలకపాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రూరల్ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.