News September 30, 2024
మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదు: వెంకయ్య
AP: తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లిష్లో ఎందుకు మాట్లాడతారో అర్థం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. ఇంగ్లిష్లో మాట్లాడే నాయకులు గొప్పవాళ్లు కాదని చెప్పారు. ఛత్రపతి, లక్ష్మీబాయి, కొమరం భీం లాంటి వాళ్లు మాతృభాష మాట్లాడే గొప్పవాళ్లు అయ్యారని తెలిపారు. ANUలో నిర్వహించిన తత్వవేత్త సచ్చిదానందమూర్తి శతజయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Similar News
News September 30, 2024
నివాస ఇళ్లను హైడ్రా కూల్చదు: రంగనాథ్
TG: పేదలు, మధ్య తరగతి ప్రజల జోలికి హైడ్రా వెళ్లదని, ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చదని కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకేనని చెప్పారు. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడడం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టడమే హైడ్రా పని అన్నారు.
News September 30, 2024
హిట్మ్యాన్ అరుదైన ఘనత
కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సుతో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దీంతో తొలి బంతికే సిక్స్ కొట్టిన నాలుగో భారత ప్లేయర్గా నిలిచారు. 2006లో WIపై ధోనీ, 2012లో NZపై జహీర్ ఖాన్, 2013లో AUSపై సచిన్ ఫస్ట్ బాల్కే సిక్స్ కొట్టారు. కాగా, హసన్ మిరాజ్ బౌలింగ్లో 23 పరుగుల వద్ద రోహిత్ బౌల్డ్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులకు డిక్లేర్ చేసింది.
News September 30, 2024
PM E-DRIVEకు క్యాబినెట్ ఆమోదం
దేశంలో EVల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడానికి ఉద్దేశించిన PM E-DRIVEకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద రెండేళ్ల పాటు రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. E-2Ws, E-3Ws, E-అంబులెన్స్లు, E-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.3,679 కోట్లు, ఛార్జింగ్ వసతులు, E-బస్సుల కోసం మిగిలిన మొత్తాన్ని ఉపయోగిస్తారు. రేపటి నుంచి(మంగళవారం) ఈ స్కీం అమలులోకి రానుంది.