News October 3, 2024
ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తే మా జవాబు గట్టిగా ఉంటుంది: ఇరాన్
ఇజ్రాయెల్పై వందలాది క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ తాజాగా ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసింది. తాము యుద్ధం కోరుకోమని, ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తే మాత్రం జవాబు గట్టిగా ఉంటుందని దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. ‘ఇజ్రాయెల్ కారణంగానే మేం స్పందించాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో అస్థిరత పెంచాలనేది ఆ దేశపు కుట్ర. ఈ రక్తపాతాన్ని ఆపాలని అమెరికా, ఐరోపా దేశాలు టెల్ అవీవ్కు చెప్పాలి’ అని స్పష్టం చేశారు.
Similar News
News October 3, 2024
నేటి నుంచి AP TET
AP: రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో (ఉ.9.30-మ.12, మ.2.30-సా.5) ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్లో తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని అధికారులకు చూపించి సరిచేసుకోవచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 4.27లక్షల మంది హాజరు కానున్నారు.
News October 3, 2024
మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పాలి: నటి కుష్బూ
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, నటి కుష్బూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సురేఖ గారూ.. మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు. మీరు సినీ పరిశ్రమ మొత్తానికి, అందులోని మహిళలకు క్షమాపణలు చెప్పాలి’ అని X వేదికగా డిమాండ్ చేశారు.
News October 3, 2024
నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోం: Jr.NTR
ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని Jr.NTR అన్నారు. నాగ చైతన్య-సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు’ అని ట్వీట్ చేశారు.