News October 3, 2024
అనర్హత పిటిషన్లపై 24న విచారణ

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. 24న మరోసారి వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా విచారిస్తామని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు.
Similar News
News December 31, 2025
‘ధురంధర్’పై బ్యాన్.. రూ.90 కోట్లు లాస్: డిస్ట్రిబ్యూటర్

రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు(రూ.1100+కోట్లు) రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో రూ.90 కోట్లు లాస్ అయ్యామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ దేశాలు మూవీని బ్యాన్ చేయడమే కారణమని పేర్కొన్నారు. PAKకు వ్యతిరేకంగా ఉండటంతో ఈ సినిమాను ఆ దేశాలు నిషేధించాయి.
News December 31, 2025
25,487 ఉద్యోగాలు.. నేడే లాస్ట్

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలున్నాయి. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. సీబీటీ, PST/PET, వైద్య పరీక్షలు, DV ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది FEB-ఏప్రిల్లో CBT ఉంటుంది. కాగా దరఖాస్తు గడువు పొడిగించబోమని ఇప్పటికే SSC స్పష్టం చేసింది.
వెబ్సైట్: ssc.gov.in
News December 31, 2025
2025: తెలుగు రాష్ట్రాల్లో వెలుగులు

2025లో AP, TGలు కీలక సంఘటనలకు వేదికలయ్యాయి.
• మే 2: అమరావతి పునర్నిర్మాణానికి PM మోదీ శంకుస్థాపన
• మే 31: Hydలో మిస్ వరల్డ్ పోటీలు.. థాయిలాండ్ సుందరి విజేత
• జూన్ 21: విశాఖలో 3 లక్షల మందితో యోగా దినోత్సవం
• ఆగస్టు 15: APలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ప్రారంభం
• అక్టోబర్ 14: విశాఖలో గూగుల్ రూ.1.35 లక్షల కోట్ల డేటా సెంటర్ ప్రకటన
• డిసెంబర్ 13: హైదరాబాద్లో మెస్సీ సందడి


