News October 4, 2024
హైకోర్టులో సజ్జలకు ఊరట

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించాలని సజ్జలను ఆదేశించింది. కేసుపై విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.
Similar News
News March 14, 2026
సీఈసీని ఎలా తొలగించవచ్చు?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం <<19371253>>ప్రధాన ఎన్నికల కమిషనర్ను<<>> తొలగించవచ్చు. ఆర్టికల్ 124(4) ప్రకారం దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమవ్వాలి. తొలగింపునకు గల కారణాలతో ఓ తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. LSలో 100, RSలో 50 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్/ఛైర్మన్కు సమర్పించాలి. దాన్ని వారు అంగీకరిస్తే ఓటింగ్లో 2/3 మెజార్టీ రావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించాలి.
News March 14, 2026
దిగ్గజ క్రికెటర్లకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

భారత దిగ్గజ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్కు BCCI ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రకటించింది. రేపు ఢిల్లీలో జరిగే నమన్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవంలో వీరిని సత్కరించనుంది. ఈ ముగ్గురినీ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో గౌరవించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లో ప్లేయర్లు కనబరిచిన అసామాన్య ప్రతిభను గుర్తిస్తూ ఏటా నమన్ అవార్డుల ప్రదానం జరుగుతుంది.
News March 14, 2026
4 రోజులుగా ICUలో తమ్మినేని వీరభద్రం

TG: CPI(M) కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం గత 4 రోజులుగా గచ్చిబౌలి (HYD) AIG హాస్పిటల్లో ICUలో చికిత్స పొందుతున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు BV.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ఇతర నాయకులు హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, 2 రోజుల్లో కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు.


