News October 4, 2024

హైకోర్టులో సజ్జలకు ఊరట

image

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించాలని సజ్జలను ఆదేశించింది. కేసుపై విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.

Similar News

News December 11, 2025

శ్రవణ్ సాయి హత్య.. సంచలన ఆరోపణలు

image

కృష్ణా(D)కు చెందిన శ్రవణ్ సాయి <<18525669>>హత్య కేసులో<<>> మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. ‘ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. నా కూతురు గర్భవతి అని తెలిసింది. తప్పు చేసిందని ఆమెను కొట్టబోతుండగా అడ్డురావడంతో అతడికి దెబ్బలు తగిలాయి. ప్రెగ్నెన్సీ సంగతి అమ్మకు తెలిసిందని అతడికి నా కూతురు మెసేజ్ చేసిందట’ అని అమ్మాయి తల్లి తెలిపారు. శ్రవణ్‌ను టార్చర్ చేసి చంపారని, ఒంటిపై గాయాలున్నాయని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.

News December 11, 2025

కార్యకర్తలతో పనిచేయండి: BJP ఎంపీలతో మోదీ

image

BJP MPలు కార్యకర్తలతో కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై దక్షిణాది BJP MPలతో ప్రత్యేక భేటీలో దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రశ్నించాలన్నారు. వచ్చే ఏడాది కేరళ, తమిళనాడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కేంద్ర సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.

News December 11, 2025

AUS ప్రపంచ కప్ టీమ్‌లో భారత సంతతి ప్లేయర్లు

image

ICC మెన్స్ U19 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా 15 మందితో జట్టును ప్రకటించింది. ఇందులో ఇద్దరు భారత సంతతి క్రికెటర్లు చోటుదక్కించుకున్నారు. ఆర్యన్ శర్మ(ఫొటోలో), జాన్ జేమ్స్ అనే యువ ఆటగాళ్లు ఇటీవల INDతో జరిగిన యూత్ టెస్టులు, వన్డేల్లో అదరగొట్టారు. దీంతో తాజాగా ప్రపంచ కప్‌కు ఎంపికయ్యారు. శ్రీలంక, చైనా మూలాలున్న ప్లేయర్లు సైతం జట్టులో ఉండటం గమనార్హం. ఈ టోర్నీ జనవరి 15 నుంచి నమీబియా, జింబాబ్వేలో జరగనుంది.