News October 5, 2024
GOOD NEWS: నేడు అకౌంట్లలోకి రూ.2,000

దసరా పండుగకు ముందు రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 18వ విడత నిధులను ప్రధాని మోదీ నేడు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. మొత్తం రూ.20వేల కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేయనున్నారు. ఈ స్కీం కింద ప్రతి 4 నెలలకు ఓసారి రూ.2వేల చొప్పున మొత్తం 3 విడతల్లో రూ.6వేలను అన్నదాతల అకౌంట్లలో డిపాజిట్ చేస్తారు.
Similar News
News January 16, 2026
రికార్డింగ్ డాన్సులను బ్యాన్ చేయండి: సునీతా కృష్ణన్

AP: సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న రికార్డింగ్ డాన్సులపై సంఘసేవకురాలు సునీతా కృష్ణన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతులతో అసభ్యకరంగా టాప్లెస్ డాన్స్లు చేయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనాగరిక పద్ధతిని సమాజం సాధారణ విషయంగా చూడటం అత్యంత ప్రమాదకరమని, మహిళల గౌరవాన్ని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని X వేదికగా సీఎం చంద్రబాబును కోరారు.
News January 16, 2026
భారీ జీతంతో SBIలో ఉద్యోగాలు

<
News January 16, 2026
ఠాక్రేలకు BJP టక్కర్.. పవార్లకు దక్కని పవర్

ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ బాడీ అయిన BMCపై 40 ఏళ్లుగా ఉన్న ఠాక్రేల గుత్తాధిపత్యానికి BJP-షిండే కూటమి గండి కొట్టింది. విభేదాలు పక్కన పెట్టి ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఏకమైనా ముంబై ఓటర్లు మాత్రం మహాయుతివైపు మొగ్గు చూపారు. ఇక పవార్లకు పెట్టని కోటలైన పుణే, పింప్రి-చించ్వాడ్లోనూ ఊహించని ఫలితాలు వచ్చాయి. బాబాయ్ శరద్ పవార్, అబ్బాయ్ అజిత్ పవార్ మనస్పర్ధలు వీడి బరిలోకి దిగినా ప్యూహాలు పటాపంచలయ్యాయి.


