News October 5, 2024
TENTH: రెండు రోజులపాటు సైన్స్ ఎగ్జామ్

TG: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జనరల్ సైన్స్ పేపర్ను రెండు రోజులపాటు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను ఇప్పటివరకు ఒకే రోజు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పేపర్కు ఎప్పటిలాగే 1.30hrs సమయం ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత టెన్త్ పేపర్లను 11నుంచి 6కు కుదించిన సంగతి తెలిసిందే.
Similar News
News July 6, 2025
ఇంజినీరింగ్.. ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు?

TG: ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుండగా <<16970142>>సీట్ల<<>> వివరాలను అధికారులు వెల్లడించారు. కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా CSEలో 26,150 సీట్లు, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 12,495 సీట్లు, ECEలో 10,125, CSE డేటా సైన్స్లో 6,996, EEEలో 4,301, ITలో 3,681, సివిల్ ఇంజినీరింగ్లో 3,129, మెకానికల్లో 2,994 సీట్లు ఉన్నాయి.
News July 6, 2025
విదేశీ గడ్డపై భారత్ సరికొత్త చరిత్ర

ఇంగ్లండ్పై రెండో టెస్టులో విజయంతో గిల్ సేన సరికొత్త రికార్డు సృష్టించింది. పరుగుల(336) పరంగా విదేశాల్లో భారత్కు ఇదే అతిపెద్ద విజయం. 2019లో వెస్టిండీస్పై 318, 2017లో శ్రీలంకపై 304, 2024లో పెర్త్లో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలుపొందింది. చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు కోహ్లీ, గంగూలీ అభినందనలు తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్లో ప్లేయర్లు అదరగొట్టారని కొనియాడారు.
News July 6, 2025
మోదీజీ.. హిమాచల్ వరదలపై ట్వీట్ చేయరా?: నెటిజన్లు

ప్రధాని మోదీ అమెరికాలో వచ్చిన వరదలపై స్పందించారు కానీ హిమాచల్ ప్రదేశ్ (HP)విలయంపై మాట్లాడకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టెక్సాస్ వరదల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ మోదీ 22 గంటల క్రితం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కానీ 5 రోజుల క్రితమే HPలో వరదలు వచ్చి 74 మంది చనిపోయినా, ఎంతో మంది నిరాశ్రయులైనా ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.