News October 7, 2024
40వేల టార్గెట్స్, 4700 టన్నెల్స్పై బాంబులేసిన ఇజ్రాయెల్

యుద్ధం మొదలయ్యాక 40వేల హమాస్ టార్గెట్స్, 4700 టన్నెల్స్, 1000 రాకెట్ లాంచర్ సైట్లను బాంబులతో నాశనం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 2023 OCT 7 నుంచి 726 మంది తమ సైనికులు మరణించారని తెలిపింది. అదేరోజు 380, మిలిటరీ ఆపరేషన్స్ మొదలయ్యాక మిగిలినవాళ్లు చనిపోయారని పేర్కొంది. 4576 మంది గాయపడ్డారని చెప్పింది. 3 లక్షల రిజర్వు సైనికుల్ని నమోదు చేసుకున్నామని, అందులో 82% మెన్, 18% విమెన్ ఉన్నారని తెలిపింది.
Similar News
News September 20, 2025
రేపటిలోగా అమెరికా వచ్చేయండి: మైక్రోసాఫ్ట్

H1B వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో మైక్రోసాఫ్ట్, JP మోర్గాన్ కంపెనీలు తమ ఉద్యోగులకు కీలక సూచనలు చేశాయి. ఉద్యోగులు అమెరికాలోనే ఉండాలని, విదేశాలకు వెళ్లవద్దని తెలిపాయి. ఇప్పటికే USను వదిలి వెళ్లిన H1B, H-4 వీసాదారులు SEP 21లోగా తిరిగి వచ్చేయాలని సూచించాయి. కాగా ఇప్పటికే H1B వీసాతో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు రెన్యూవల్, ట్రాన్స్ఫర్ టైమ్లో ఈ ఫీజు చెల్లించాల్సి వస్తుందని కంపెనీలు భయపడుతున్నాయి.
News September 20, 2025
అల్పపీడనం ముప్పు.. అతిభారీ వర్షాలకు అవకాశం!

తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది తుఫానుగా మారే అవకాశమూ ఉందని అంచనా వేశారు. సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.
News September 20, 2025
AIIMSలో 77 ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్ సమీపంలోని బీబీనగర్ AIIMSలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 77 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఈ నెల 26లోగా అప్లై చేసుకోవాలి. వయసు 45 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1,170. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, జీతభత్యాల వివరాల కోసం <
#ShareIt