News October 8, 2024
19 నుంచి ఫార్మసీ కౌన్సెలింగ్

TG: బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా డి, బీటెక్ బయోటెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ జరగనుంది. 22 వరకు ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 21 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 28న సీట్ల కేటాయింపు ఉంటుంది. 30వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో చేరాలి. నవంబర్ 4 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
Similar News
News January 14, 2026
వచ్చే నెల 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

AP: టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అనంతరం గ్రాండ్ టెస్ట్, పబ్లిక్ పరీక్షలు ఉండనున్నాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
News January 14, 2026
CUSBలో 84 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్(CUSB)లో 84 టీచింగ్(62), నాన్ టీచింగ్(22) పోస్టుల కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, సంబంధిత విభాగంలో పీజీ, PhD, M.Ed, NET/SLET/SET, LLM, M.Tech, MBBS, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://www.cusb.ac.in
News January 14, 2026
ప్రకృతి సేద్యం.. వరిలో కాండం తొలుచు పురుగు నివారణ

ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసే వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచాలి. ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. ముందు జాగ్రత్తగా ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. పురుగు నివారణకు 5 లీటర్ల 5% వేప కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిలక దశలో మరియు అంకురం దశలో 3లీటర్ల అగ్నాస్త్రంను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.


