News October 9, 2024
మదనపల్లె జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News March 31, 2026
ఇన్స్టాగ్రాం ప్రేమ.. చిత్తూరు అమ్మాయి మిస్సింగ్

ఇన్స్టాగ్రాం పరిచయం ప్రేమగా మారిన ఘటన ఇది. చిత్తూరు వన్ టౌన్ పరిధిలోని బాలిక(17)కు పాకాల మండలం దామల చెరువుకు చెందిన ప్రవీణ్ ఇన్స్టాగ్రాంలో పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. ఈనెల 23న బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ వద్ద బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికను వెంట తీసుకెళ్లడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News March 31, 2026
చిత్తూరు: లవర్తో కలిసి భర్తను చంపేసింది..!

కుప్పం(M) మోట్లచేనులో ఈనెల 12న హత్యాహత్నానికి గురైన బాలరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని భార్య మగ(24) అదే గ్రామానికి చెందిన తిరుపతి(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే విషయం బాలరాజుకు తెలియడంతో భార్యను నిలదీశాడు. అన్ని మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో మగ తన ప్రియుడితో కలిసి నిద్రపోతున్న భర్తను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశారు. ఆసుపత్రిలో అతను చనిపోగా నిందితులను అరెస్ట్ చేశారు.
News March 31, 2026
చిత్తూరు: ఒక్కరోజే ‘రికార్డ్’

ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖకు సోమవారం రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. ఒక్కరోజే 1,458 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగగా వాటి ద్వారా రూ.3.25 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.


