News October 10, 2024

సంక్షోభ సమయంలో నేనున్నాంటూ..

image

భారత్‌ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

Similar News

News March 28, 2026

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్

image

LPG సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది. ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ లింకులు, నకిలీ కాల్స్ ద్వారా వినియోగదారుల బ్యాంక్ వివరాలు, OTPలు సేకరించి కేటుగాళ్లు సొమ్ము దోచుకుంటున్నారు. అందుకే ఎవరికీ OTPలు చెప్పవద్దని, ఫేక్ APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

News March 28, 2026

యుద్ధ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం: మోదీ

image

పశ్చిమాసియాలో యుద్ధంతో అనేక దేశాల్లో ఆహారం, ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని PM మోదీ తెలిపారు. ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పౌరులంతా ఐక్యంగా, ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. భయాందోళనలు రేకిత్తించే తప్పుడు ప్రచారాలు చేయొద్దని పార్టీలకు హితవు పలికారు. నోయిడా(UP)లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తొలి దశను ఆయన ప్రారంభించారు.

News March 28, 2026

గంభీర్ ఫొటోలు వాడొద్దు: హైకోర్టు

image

టీమ్‌ఇండియా కోచ్ గంభీర్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఫొటో, వాయిస్‌తో రూపొందించిన ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్‌ను 36 గంటల్లోగా తొలగించాలని ఇన్‌స్టా, గూగుల్ సహా ఇతర SM ప్లాట్‌ఫామ్స్‌ను ఆదేశించింది. ఈ కంటెంట్‌ను క్రియేట్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. అనుమతి లేకుండా వీడియోలు చేయడం వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.