News October 14, 2024

ఆర్టీసీ టికెట్ ఛార్జీలు చూసి ప్రయాణికులు షాక్!

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగి నగరబాట పట్టిన ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచి స్పెషల్ సర్వీసులంటూ అమాంతం ధరలు పెంచేసింది. HNK- HYDకి వెళ్తోన్న ఓ ప్రయాణికుడు ధరల పెంపుపై వాపోయాడు. మొన్నటివరకు రాజధాని బస్సులో రూ.370 ఉండగా రూ.160 పెంచి రూ.530 చేశారంటూ మొరపెట్టుకున్నాడు. ఛార్జీలు పెంచడంతో మెదక్(D) నర్సాపూర్‌లో ప్రయాణికులు ధర్నా చేపట్టారు.

Similar News

News December 28, 2025

సిల్వర్ షాక్.. నెలలో ₹82,000 జంప్

image

సరిగ్గా నెల క్రితం KG వెండి ధర ₹1,92,000. ఇప్పుడది ₹2,74,000కు చేరింది. కేవలం నెలరోజుల్లోనే ₹82,000 పెరిగింది. ‘పేదవాడి బంగారం’గా పిలిచే వెండి ఇప్పుడు తానూ బంగారం బాటలోనే నడుస్తానంటోంది.. దీంతో కొనలేక సామాన్యులు.. అమ్మకాలు లేక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ రానుండటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ తలకిందులు కావడం పక్కాగా కనిపిస్తోంది!

News December 28, 2025

DRDOలో JRF పోస్టులు

image

DRDO పరిధిలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(<>HEMRL<<>>) 2 JRF పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc(కెమిస్ట్రీ), NET, M.Tech(పాలిమర్స్/కెమికల్ ఇంజినీరింగ్/మెకానికల్/ఏరోస్పేస్), BE, బీటెక్, GATE ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. ఎంపికైనవారికి నెలకు రూ.37,000 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in/

News December 28, 2025

‘అర్బన్ నక్సల్స్’పై NIA ఫోకస్.. రాబోయే రోజుల్లో అరెస్టులు!

image

యువతలో మావోయిస్టు భావజాలాన్ని నూరిపోస్తున్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్లపై NIA ఫోకస్ పెట్టింది. అడవుల్లో మావోయిస్టులను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నా కొందరు మేధావుల ముసుగులో యువతను రెచ్చగొడుతున్నారని సీరియస్‌గా ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మావోలను హీరోలుగా వర్ణిస్తూ అమాయకులను అడవిబాట పట్టిస్తున్నట్లు గుర్తించింది. రాబోయే రోజుల్లో అలాంటి వారిని అరెస్టు చేయడానికి ప్లాన్లు వేస్తోంది.