News October 14, 2024

ఆర్టీసీ టికెట్ ఛార్జీలు చూసి ప్రయాణికులు షాక్!

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగి నగరబాట పట్టిన ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచి స్పెషల్ సర్వీసులంటూ అమాంతం ధరలు పెంచేసింది. HNK- HYDకి వెళ్తోన్న ఓ ప్రయాణికుడు ధరల పెంపుపై వాపోయాడు. మొన్నటివరకు రాజధాని బస్సులో రూ.370 ఉండగా రూ.160 పెంచి రూ.530 చేశారంటూ మొరపెట్టుకున్నాడు. ఛార్జీలు పెంచడంతో మెదక్(D) నర్సాపూర్‌లో ప్రయాణికులు ధర్నా చేపట్టారు.

Similar News

News July 8, 2025

ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్

image

TG: తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీ‌లో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు. ‘రైతు శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రమ్మని చెబితే సీఎం ఢిల్లీ వెళ్లారు. ఆయన బదులు మంత్రులు ఎవరైనా వస్తారని భావిస్తున్నా. ఎవరొచ్చినా చర్చకు సిద్ధం. అక్కడే ఎదురుచూస్తాం. సీఎం ఇంకో రోజు టైమ్ ఇచ్చినా చర్చకు వస్తాం’ అని తెలిపారు.

News July 8, 2025

చెల్లెలు లాంటి నాపై ప్రసన్న నీచపు వ్యాఖ్యలు: ప్రశాంతి

image

AP: వరుసకు చెల్లెలు అయ్యే తనపై YCP నేత నల్లపురెడ్డి <<16985283>>ప్రసన్న<<>> కుమార్ రెడ్డి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని TDP MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న ప్రసన్నను కోర్టుకు ఈడుస్తానని ఆమె హెచ్చరించారు. ‘ప్రతీసారి VPRకు డబ్బు ఉందని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు. ఆయనకు లేవా డబ్బులు? ఏమైనా అడుక్కు తింటున్నారా? అనిల్‌కు కూడా జైలు శిక్ష తప్పదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News July 8, 2025

ఎల్లుండి నుంచి 16 బోగీలతో కాచిగూడ వందేభారత్

image

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు బోగీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 7 ఛైర్‌కార్, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో 8 బోగీలు ఉండగా, ఈ నెల 10వ తేదీ నుంచి 14CC, 2 EC కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది. కాగా బుధవారం మినహా ప్రతిరోజూ ఈ రైలు ఉ.5.45కు కాచిగూడలో బయల్దేరి మ.2 గంటలకు యశ్వంత్‌పూర్, అలాగే మ.2.45కు అక్కడ బయల్దేరి రా.11 గంటలకు కాచిగూడ చేరుతుంది.