News October 15, 2024

కోహ్లీ.. మరో 53 పరుగులు చేస్తే

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యారు. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో మరో 53 పరుగులు చేస్తే 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. దీంతో భారత జట్టు తరఫున టెస్టుల్లో 9వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలవనున్నారు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 115 టెస్టులు ఆడిన కోహ్లీ 8,947 పరుగులు చేశారు.

Similar News

News November 11, 2025

జూబ్లీహిల్స్ పోలింగ్ అప్‌డేట్స్

image

✦ మ.3 గంటల వరకు 40.20% ఓటింగ్ నమోదు.. సా.6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
✦ కాంగ్రెస్ నేతలు నగదు పంచుతూ ఓటర్లను భయపెడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న వారి సంగతి 14వ తేదీన చెప్తా: మాగంటి సునీత
✦ ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఆచరించేది కాంగ్రెస్.. ఓడిపోతున్నామని అసహనంతో BRS అభ్యర్థి మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం

News November 11, 2025

వీరు వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు!

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏడాదిలోపు పిల్లలు ఉంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చు. సుపథం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. దర్శన సమయం 12PM నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. దీనికి ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా సుపథం వద్దకు వెళ్లి పిల్లల జనన ధ్రువీకరణ పత్రం & తల్లిదండ్రుల ఆధార్ కార్డులు సమర్పిస్తే చాలు. వీరితోపాటు 12ఏళ్లలోపు తోబుట్టువును అనుమతిస్తారు. share it

News November 11, 2025

కనురెప్పలు ఒత్తుగా పెరగాలంటే..

image

కనురెప్పలు ఒత్తుగా ఉంటే ముఖం అందంగా ఉంటుంది. దీనికోసం కొన్ని సహజ చిట్కాలు..* రాత్రి పడుకొనే ముందు ఒక చుక్క ఆముదాన్ని కనురెప్పలకు రాస్తే ఒత్తుగా పెరుగుతాయి. * గ్రీన్‌టీలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ కనురెప్పలు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడతాయి. గ్రీన్‌టీలో దూది ఉండను ముంచి కనురెప్పలపై అద్దాలి. ఇలా వారానికోసారి చెయ్యాలి. అయితే కనురెప్పలకు ఏవి రాసినా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కంట్లోకి వెళ్లి ఇబ్బంది పెడతాయి.