News October 16, 2024
దర్యాప్తు జరుగుతుండగా రిజైన్ చేసిన ముడా చీఫ్

ముడా స్కామ్ కేసుపై వేగంగా దర్యాప్తు జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ మారిగౌడ అనారోగ్య కారణాలతో పదవికి రిజైన్ చేశారు. ముడాలో భూముల సేకరణ, పంపిణీలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. మైసూరులో అక్రమంగా 14 ప్లాట్లు పొందారన్న ఆరోపణలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అతడి భార్య పార్వతి, బావమరిదిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ స్కామ్పై లోకాయుక్త, ED వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి.
Similar News
News February 3, 2026
మున్సి‘పోల్స్’: ప్రచార బరిలోకి ముఖ్యనేతలు

TG: పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగుతుండడంతో మున్సి‘పోల్స్’ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. CM రేవంత్ మిర్యాలగూడలో రేపు తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. FEB 9 వరకు CM రోజుకో సభలో ప్రచారం చేస్తారు. ఇక ప్రచారాలను హోరెత్తించేలా BRS కదులుతోంది. KTR, హరీశ్ రావు పలు ర్యాలీలు, సభలు నిర్వహించనునున్నారు. అటు BJP తమకు పట్టున్న ఉత్తర TGపై దృష్టి సారించింది. పార్టీ జాతీయ నాయకులు, MP, MLAలను రంగంలోకి దించుతోంది.
News February 3, 2026
హెయిర్ గ్రోత్కి గుడ్డు పెంకుల మాస్క్

కోడిగుడ్డు పెంకులను వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం బావుంటుందని నిపుణులు చెబుతున్నారు. కోడి పెంకులను మెత్తటి పొడిలా చేసి కొబ్బరి నూనెలో కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే చాలు. వారానికోసారి ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది. ఆలివ్ నూనెలో ఒక స్పూన్ పెంకుల పొడి కలిపి తలకు పట్టించాలి. తర్వాత తలస్నానం చెయ్యాలి. గుడ్డు పెంకులోని పోషకాలు చుండ్రు, దురదను తగ్గిస్తాయి.
News February 3, 2026
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


