News October 17, 2024
అమెజాన్ ప్రైమ్లో యాడ్స్.. వచ్చే ఏడాది అమలు
ఇండియాలోని యూజర్లకు షాకిచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వచ్చే ఏడాది నుంచి తమ ప్లాట్ఫామ్లో యాడ్స్ను జోడించనున్నట్లు ప్రకటించింది. యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం మరింత ధర వెచ్చించి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి రేట్ల వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, US, UK తదితర దేశాల్లోని యూజర్లకు యాడ్స్తో కూడిన కంటెంట్ను ప్రైమ్ అందిస్తోంది.
Similar News
News October 17, 2024
పురుషులకూ బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు
బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారి స్త్రీలకు మాత్రమే వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ పురుషుల్లోనూ వస్తుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ సీఎన్ పాటిల్ తెలిపారు. ‘అరుదే అయినా వచ్చే ప్రమాదం లేకపోలేదు. హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, పర్యావరణం దీనికి కారణం కావొచ్చు. 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్న పురుషులకు రిస్క్ ఎక్కువ. ఛాతీలో గడ్డ కనిపిస్తే వెంటనే పరీక్షించుకోవడం ఉత్తమం’ అని వివరించారు.
News October 17, 2024
సురేఖపై పరువు నష్టం కేసు.. రేపు కోర్టుకు KTR
TG: మంత్రి సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్ రేపు నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. జడ్జి ముందు ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాగా నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో నాగార్జున, కేటీఆర్పై సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై ఇప్పటికే నాగార్జున డిఫమేషన్ కేసు వేసి, కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
News October 17, 2024
భారత్ను హేళన చేసిన మాజీ ప్లేయర్.. ఫ్యాన్స్ ఆగ్రహం
న్యూజిలాండ్పై భారత్ 46 రన్స్కే ఆలౌట్ కావడాన్ని సానుకూలంగా తీసుకోవాలని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో 36 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని గుర్తుచేసేలా ‘కనీసం 36 రన్స్ను దాటారుగా’ అంటూ హేళన చేశారు. ఆ ట్వీట్పై భారత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్పై ఇంగ్లండ్ 2019 నుంచి గెలవలేదని, ఐర్లాండ్ చేతిలో ఆ జట్టు 52 రన్స్కే ఔటైందని కౌంటర్లు వేస్తున్నారు.