News October 18, 2024
టీడీపీ ప్రజాప్రతినిధులతో నేడు సీఎం కీలక భేటీ

AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ MLAలు, MLCలు, MPలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. TDP సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ తదితర 8 అంశాలపై చర్చిస్తారు. అలాగే మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపు, క్షేత్రస్థాయి సమస్యలపైనా చర్చ జరుగుతుందని సమాచారం.
Similar News
News February 28, 2026
275 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 28, 2026
కాలసర్ప దోషం పోవాలంటే?

కాలసర్ప దోష నివారణకు సోమవారం నల్ల నువ్వులతో శివాభిషేకం, మహా మృత్యుంజయ మంత్ర పఠనం చేయాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ‘నాగపంచమి నాడు నాగేంద్రుని పూజించాలి. వెండి పాముల జతను నదిలో వదిలితే దోష తీవ్రత తగ్గుతుంది. శనివారం రావిచెట్టుకు నీరు పోసి 7 ప్రదక్షిణలు చేయాలి. పేదలకు నల్ల దుప్పట్లు దానం చేయాలి. నాసిక్లో శాంతి పూజలు నిర్వహించడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి’ అని అంటున్నారు.
News February 28, 2026
కాకినాడ పేలుడు ఘటన.. హోంమంత్రికి సీఎం ఆదేశం

AP: కాకినాడ జిల్లాలో జరిగిన పేలుడు ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తక్షణ సాయం చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. మరోవైపు పేలుడు ధాటికి 18 మంది సజీవ దహనం కాగా వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.


