News October 19, 2024
రైతుల జీవితాలను మారుస్తోన్న బాలిక
వ్యవసాయం గురించి పూర్తిగా తెలియని వయసులోనూ విత్తనాలను భద్రపరుస్తున్నారు 8వ తరగతి చదివే హర్షిత ప్రియదర్శిని. ఒడిశాలోని కోరపట్లో నివసించే ఈ ‘సీడ్ గర్ల్’.. 2023లో సీడ్ బ్యాంక్ను స్టార్ట్ చేశారు. ఇందులో 180 రకాల వరి, 80 రకాల మిల్లెట్స్ను భద్రపరిచారు. ప్రతి రకాన్ని 250gms లేదా 100gms సేకరిస్తూ రైతులకు ఉచితంగా సీడ్స్ ఇస్తున్నారు. పద్మశ్రీ కమలా పూజారి నుంచి ప్రేరణ పొందినట్లు హర్షిత తెలిపారు.
Similar News
News October 20, 2024
అక్టోబర్ 20: చరిత్రలో ఈరోజు
1937: హాస్యనటుడు రాజబాబు జననం
1978: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జననం
1990: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోన ప్రభాకర్ రావు మరణం
2008: దర్శకుడు సి.వి. శ్రీధర్ మరణం
2011: నటుడు, గాయకుడు అమరపు సత్యనారాయణ మరణం
➢ప్రపంచ గణాంక దినోత్సవం
News October 20, 2024
హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?: బొత్స
AP: ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని CM చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు తమ నేతలకు జమిలీ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారని అన్నారు. ‘ఈ ప్రభుత్వ కాలం మరో రెండున్నరేళ్లే అని CBN వ్యాఖ్యలతో అర్థమవుతోంది. మద్యం, ఇసుకలో అక్రమాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. ఎరువులు, విత్తనాలు మార్కెట్లో కొనుక్కునే దుస్థితిలో రైతులున్నారు’ అని విమర్శించారు.
News October 20, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 20, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:11 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:01 గంటలకు
అసర్: సాయంత్రం 4:14 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:51 గంటలకు
ఇష: రాత్రి 7.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.