News October 21, 2024
నందిగం సురేశ్కు 14 రోజుల రిమాండ్
AP: ఓ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించారు. సురేశ్ ప్రోద్బలంతోనే ఈ వివాదం జరిగిందనే బంధువుల ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 22, 2024
దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి నూతనంగా ఇళ్లు: పెమ్మసాని
AP: PM ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా రెండు కోట్ల నూతన గృహాల లబ్ధిదారులకు ఎంపిక చేస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ‘ఆవాస్’ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా అర్హుల ఎంపిక పారదర్శకంగా చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గృహ నిర్మాణ రంగం కుంటుపడిందని మంత్రి పార్థసారధి విమర్శించారు.
News October 22, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 22, 2024
రెండో టెస్ట్ మ్యాచ్కు స్లో పిచ్!
భారత్-న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం పుణే స్టేడియంలో స్లో పిచ్ సిద్ధమవుతోంది! బెంగళూరు పిచ్తో పోలిస్తే ఫ్లాట్గా ఉండి తక్కువ బౌన్స్తో ఉంటుందని తెలుస్తోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్లో ఓటమి తరువాత రెండో మ్యాచ్లో గెలుపు కోసం భారత్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. WTC ఫైనల్ రేసులో ముందుండాలంటే 2-1తో సిరీస్ గెలవడం భారత్కు అత్యవసరం.