News October 21, 2024
జగన్ బీజేపీకి దత్తపుత్రుడు: షర్మిల

AP: మాజీ సీఎం YSR మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. గత YCP ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూసిందన్నారు. ‘YSR తన జీవితం మొత్తం మత పిచ్చి BJPని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ గారు దత్తపుత్రుడు. అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు’ అని దుయ్యబట్టారు.
Similar News
News November 1, 2025
తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫల్యమే కారణం: దేవాదాయ శాఖ

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో <<18167780>>తొక్కిసలాట <<>>ఘటనపై దేవాదాయ శాఖ స్పందించింది. అది పూర్తిగా ప్రైవేటు గుడి అని, ప్రభుత్వ అధీనంలో లేదని తెలిపింది. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పింది. ప్రభుత్వానికి వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా ఈ ఆలయాన్ని ఇటీవలే ప్రారంభించారని అధికారులు చెబుతున్నారు.
News November 1, 2025
కన్నడను కాదనే వారందరూ మన వ్యతిరేకులే: సిద్దరామయ్య

హిందీ, సంస్కృతాల ప్రోత్సాహానికి అధిక నిధులు కేటాయిస్తూ ఇతర భాషలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కర్ణాటక CM సిద్దరామయ్య విమర్శించారు. ‘రాష్ట్రం నుంచి ₹4.5 లక్షల కోట్లు కేంద్రానికి వెళ్తుండగా మనకు సరైన వాటా మేరకు నిధులు అందడం లేదు. అరకొరగా విదిలిస్తున్నారు’ అని మండిపడ్డారు. కన్నడను వ్యతిరేకించే వారందరినీ మనమూ వ్యతిరేకించాల్సిందేనని రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ఆయన పిలుపునిచ్చారు.
News November 1, 2025
కాశీబుగ్గ ఘటనపై విచారణకు ఆదేశం

AP: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోవడం, పలువురు గాయపడటంతో ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు దిగింది. స్థానిక, జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి తరలింది. ప్రైవేటు ఆలయమైన ఇక్కడ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.


