News October 22, 2024

ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి మరో పోస్టర్

image

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి మేకర్స్ మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మంట అంటుకున్న సింహాసనాన్ని తలకిందులుగా చూపించారు. రేపు డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త అప్‌డేట్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.

Similar News

News October 22, 2024

హరియాణాలో 16మంది రైతుల అరెస్టు

image

పంట వ్యర్థాలు కాలుస్తున్న 16మంది రైతుల్ని హరియాణా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఏటా శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణ స్థాయికి చేరుకుంటోంది. పంజాబ్, హరియాణా రైతులు పంటవ్యర్థాలు కాల్చడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో చట్ట విరుద్ధంగా పంట వ్యర్థాలను కాలుస్తున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిలబుల్ అఫెన్స్ కావడంతో వెంటనే బెయిల్ లభించినట్లు వారు తెలిపారు.

News October 22, 2024

ఈ చికెన్ తింటే బతుకుతామా?

image

TG: రెస్టారెంట్లు అపరిశుభ్ర, పాడైపోయిన వంటకాలతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రాజధాని హైదరాబాదే కాదు ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. తాజాగా నిజామాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆర్కేడ్ రెస్టారెంట్ అండ్ బార్, లహరి హోటల్‌లో కుళ్లిపోయిన చికెన్ దర్శనమిచ్చింది. దాన్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు గుర్తించారు. అలాగే సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు తెలిపారు.

News October 22, 2024

విద్యార్థుల ఫుట్ బోర్డు ప్ర‌యాణం.. స్పందించిన TGSRTC

image

ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే రూట్ల‌లో బ‌స్సుల‌ సంఖ్య‌ను పెంచాల‌ని నిర్ణయించినట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులో కొందరు విద్యార్థులు <<14425042>>ఫుట్ బోర్డు ప్రయాణం<<>> చేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యార్థుల‌ను క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు ఆర్టీసీ యాజ‌మాన్యం క‌ట్టుబ‌డి ఉందని, ఫుట్ బోర్డు ప్ర‌యాణం చేయ‌కుండా స‌హ‌క‌రించాల‌ని కోరారు.