News October 23, 2024
13వేల KMS సైకిల్పై ప్రయాణించి రొనాల్డోను చేరిన అభిమాని
ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. చైనాకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా 13వేల కిలోమీటర్లు ఆరున్నర నెలలు సైకిల్పై ప్రయాణించి రొనాల్డోను కలుసుకున్నారు. సౌదీ ప్రో లీగ్లో అల్ షబాబ్తో జరిగిన మ్యాచ్ తర్వాత అభిమాని గురించి తెలుసుకొని రొనాల్డో అతణ్ని కలిసి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. విమానంలో ప్రయాణించే స్తోమత లేకపోవడంతో అతను సైకిల్పై వెళ్లినట్లు తెలుస్తోంది.
Similar News
News October 23, 2024
BRICSలో పాక్కు షాక్!
బ్రిక్స్ సదస్సులో పాక్కు షాక్ తగిలింది. తన మిత్రదేశం చైనా కీలక సభ్యదేశమైనప్పటికీ ఇస్లామాబాద్ను బ్రిక్స్ విస్తరణలో పరిగణించలేదు. భారత్ వ్యతిరేకించడంతో రష్యాలో జరుగుతున్న సదస్సులో పాక్ ప్రతినిధికి స్థానం కూడా దక్కలేదు. బ్రిక్స్ విస్తరణలో ఇప్పటికే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE, సౌదీ అరేబియా చేరాయి. తుర్కియే, అజర్బైజాన్, మలేషియా దరఖాస్తు చేసుకున్నాయి.
News October 23, 2024
దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?
దీపావళి పండుగను ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి అక్టోబర్ 31న మ.3.52 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సా.6.16 ని.కు ముగుస్తుంది. దీని ప్రకారం 31న సా.5.36 నుంచి 6.16 వరకు లక్ష్మీ పూజ ముహూర్తం ఉంది. ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే దృక్ పంచాంగం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 1న దీపావళి జరుపుకోనున్నారు.
News October 23, 2024
YS జగన్కు మంత్రి లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్
AP: దిశ చట్టం, శాంతి భద్రతలపై డిబేట్కు రావాలని YS జగన్కు మంత్రి లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ‘జగన్ తన పార్టీ నేతలు, తన మీడియాతో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నాడు. దిశ చట్టాన్ని నిలిపివేశామని అంటాడు. అసలు ఆ చట్టమే లేదు. YCP హయాంలో నేరాలు భారీగా పెరిగాయి. YCP పోలీస్ వ్యవస్థను ప్రతిపక్షాలను హింసించడానికి వాడింది. వీటిపై డిబేట్కు రాకుంటే తాను ఫేక్ అని జగన్ ఒప్పుకున్నట్లే’ అని ట్వీట్ చేశారు.