News October 23, 2024
జిన్పింగ్, మోదీ మధ్య కొనసాగుతున్న చర్చలు
చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యాలోని కజన్లో జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో వీరు భేటీ అయ్యారు. దాదాపు ఐదేళ్ల తర్వాత వీరు సమావేశమవడం గమనార్హం. లద్దాక్లో ఎల్ఏసీ వెంబడి మిలిటరీ పెట్రోలింగ్పై రెండు రోజుల క్రితం ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News October 23, 2024
ఉద్యోగి కారుకు ప్రమాదం.. మేనేజర్ రిప్లై ఇదే..!
ఉద్యోగి కారు ప్రమాదానికి గురైంది. కారు ముందుభాగం దెబ్బతిన్న ఫొటోను అతడు తన మేనేజర్కి పంపించాడు. ఎవరైనా అయితే నువ్వు ఎలా ఉన్నావనే అడుగుతారు. కానీ ఆ మేనేజర్ మాత్రం ఏ టైమ్కి ఆఫీస్కి వస్తావో చెప్పు అంటూ రిప్లై ఇచ్చారు. ‘మీరు లేటుగా రావడాన్ని అర్థం చేసుకోగలను. కానీ మీ కుటుంబీకులు మరణిస్తే తప్ప ఆఫీసుకి రాకపోవడాన్ని ఏ సంస్థా సమర్థించదు’ అని జవాబిచ్చారు. ఈ చాట్ స్క్రీన్షాట్ వైరల్ అవుతోంది.
News October 23, 2024
24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్: మంత్రి
AP: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో.జిల్లా ధర్మవరానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమ చేసినట్లు తెలిపారు. ‘ఇచ్చిన గడువు కంటే ముందే డబ్బులు చెల్లించాం. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం CM, Dy.CM ఆలోచన చేస్తున్నారనడానికి ఇదే తార్కాణం’ అని Xలో పేర్కొన్నారు.
News October 23, 2024
ప్రియాంకా గాంధీకి బెస్ట్ విషెస్: సీఎం రేవంత్
కేరళలోని వయనాడ్ లోక్సభ ఉపఎన్నికకు ఇవాళ నామినేషన్ వేసిన ప్రియాంకా గాంధీకి సీఎం రేవంత్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ప్రియాంకా గాంధీకి మనస్ఫూర్తిగా విషెస్ చెబుతున్నాను. ఆమె తన శక్తిమంతమైన స్వరంతో ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో గట్టిగా వినిపిస్తారని నేను నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కేరళకు వెళ్లిన సంగతి తెలిసిందే.