News October 23, 2024
గ్రూప్ 1 మెయిన్స్: మూడో రోజు హాజరు 68.2%
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకి తగ్గుతోంది. ఇవాళ (మూడో రోజు) జరిగిన పేపర్-2 హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ పరీక్షను 68.2% మంది అభ్యర్థులు రాశారు. మొత్తం 31,383 మంది అభ్యర్థుల్లో 21,429 మంది మాత్రమే హాజరయ్యారు. తొలి రోజు 72.4%, రెండో రోజు 69.4% హాజరు నమోదైంది. ఈ పరీక్షలు ఈనెల 27 వరకు కొనసాగనున్నాయి.
Similar News
News October 24, 2024
సీఎం చంద్రబాబుని కలిసిన ముస్లిం సంఘాలు
AP: వక్ఫ్ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలను వ్యతిరేకించాలని ఆలిండియా ముస్లిం లా బోర్డు, పలు ముస్లిం సంఘాలు సీఎం చంద్రబాబుని కోరాయి. ఈ మేరకు సచివాలయంలో సీఎంని కలిసి వినతిపత్రం అందించాయి. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. 2026 మార్చి కన్నా ముందే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు.
News October 24, 2024
ఆ ఘటన తర్వాతే గ్లామర్ పాత్రలు వద్దనుకున్నా: సాయి పల్లవి
సినిమాల్లో శరీరం కనిపించేలా డ్రస్సెస్ వేసుకోకూడదని తాను నియమంలా పెట్టుకున్నట్లు నటి సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను జార్జియాలో మెడిసిన్ చదువుకున్నా. అక్కడ ఓసారి టాంగో డాన్స్ చేశాను. సినిమాల్లో పేరు వచ్చాక ఆ డాన్స్ వీడియో వైరల్ అయింది. రకరకాల కామెంట్స్ వచ్చాయి. బాధ అనిపించింది. స్కిన్ షో పాత్రలు చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నా’ అని వివరించారు.
News October 24, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 24, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:59 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:12 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
అసర్: సాయంత్రం 4:12 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:49 గంటలకు
ఇష: రాత్రి 7.02 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.