News October 25, 2024
నేటి నుంచి పశుగణన
AP: నేటి నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు 21వ అఖిల భారత పశు గణన చేపట్టనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 21,173 గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో పశువుల వివరాలను నమోదు చేయనున్నట్లు పేర్కొంది. గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, వివిధ రకాల కోళ్లు, పక్షులతో సహా 16రకాల పెంపుడు జంతువులపై జాతుల వారీగా సమాచారాన్ని సేకరించనుంది. పశు గణనను ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు.
Similar News
News October 25, 2024
ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటీరియల్ ఇదే!
బంగారం, వజ్రాలు వంటి ఖనిజాలు ఖరీదైనవని అనుకుంటాం. కానీ, ప్రపంచంలో ఎవ్వరూ కొనలేని మెటీరియల్ ఒకటి ఉంది. అదే యాంటీమ్యాటర్. భౌతిక శాస్త్రంలో యాంటీమ్యాటర్ అనేది పదార్థానికి వ్యతిరేకమైనదని నిర్వచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే సుమారు $100 ట్రిలియన్లు అయితే దీని 1gm ధర దాదాపు $62.5 ట్రిలియన్లు (రూ.5వేల బిలియన్లు). ఇది భూమి మీద లభించదని, దీనిని రవాణా చేయడమూ ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
News October 25, 2024
విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం: KTR
TG: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. సిరిసిల్లలో జరిగిన విద్యుత్ మండలి బహిరంగ విచారణలో ఆయన మాట్లాడారు. ‘అన్ని సంస్థలను ఒకే కేటగిరీగా మార్చాలన్న ప్రతిపాదన సరైనది కాదు. ఛార్జీల పెంపుతో చిన్న పరిశ్రమలపై భారం పడుతుంది. అన్ని ఇండస్ట్రీలను కాపాడుకుంటేనే మనుగడ ఉంటుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఎక్కడ?’ అని ప్రశ్నించారు.
News October 25, 2024
BREAKING: కొండా సురేఖకు కోర్టు చివాట్లు
TG: మంత్రి కొండా సురేఖకు HYD సిటీ సివిల్ కోర్టు చివాట్లు పెట్టింది. KTR వేసిన <<14421276>>పరువునష్టం దావా<<>>ను కోర్టు విచారించింది. బాధ్యత గల పదవిలో ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మందలించింది. ఒక ప్రభుత్వ ప్రతినిధి నుంచి ఇలాంటి మాటలు రావడం తీవ్ర అభ్యంతరకరం, అనూహ్యమని పేర్కొంది. మరోసారి KTRపై అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. తన వ్యాఖ్యలకు సంబంధించి పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది.